మహీంద్రా వర్సిటీకి భారీ మొత్తంలో నిధులు ప్రకటించిన ఆనంద్ మహీంద్రా

  • 2020లో హైదరాబాదులో మహీంద్రా వర్సిటీ స్థాపన
  • 35 కోర్సులతో విద్యాబోధన
  • ఐదేళ్ల కాల వ్యవధిలో రూ.500 కోట్లు అందించాలని మహీంద్రా ఫ్యామిలీ నిర్ణయం
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజ వ్యాపార సంస్థ మహీంద్రా గ్రూప్ హైదరాబాదులో నాలుగేళ్ల కిందట మహీంద్రా యూనివర్సిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో 35 రకాల యూజీ, పీజీ, పీహెచ్ డీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 

త్వరలోనే ఇక్కడ హాస్పిటాలిటీ మేనేజ్ మెంట్, లిబరల్ ఆర్ట్స్ కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. 

ఈ క్రమంలో, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా కీలక ప్రకటన చేశారు. హైదరాబాదులోని మహీంద్రా యూనివర్సిటీకి రూ.500 కోట్ల నిధులు అందించనున్నట్టు వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి ఐదేళ్ల కాల వ్యవధిలో ఈ నిధులు అందిస్తామని, ఈ మేరకు తమ కుటుంబం నిర్ణయించిందని ఆనంద్ మహీంద్రా వివరించారు. 

అంతేకాదు, మహీంద్రా వర్సిటీకి అనుబంధంగా కొనసాగుతున్న ఇందిరా మహీంద్రా స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కు ప్రత్యేకంగా రూ.50 కోట్లు అందిస్తామని తెలిపారు.

Mahindra University
Anand Mahindra
Funds
Mahindra Family
Hyderabad

More Telugu News